APT: రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం ప్రత్యేక పుష్పాల అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. ఉదయాన్నే స్వామివారికి పురోహితులు రామకృష్ణ పంచామృత, ఏకబిలా రుద్రాభిషేకము చేపట్టి స్వామి మూలవిరాట్పై ప్రత్యేక పుష్పాలతో అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని వారి వారి మొక్కలను తీర్చుకున్నారు.