E.G: రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 128 మందికి రూ. కోటి 74 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. సోమవారం రాజమండ్రిలో 18 మందికి ఎల్ఓసితో కలిపి సుమారు రూ. 18 లక్షలు లబ్దిదారులకు అందించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి నుంచి ఆర్ధిక సాయం అంద లేదని ఆయన పేర్కొన్నారు.