ప్రకాశం: కనిగిరి మండల పరిషత్ కార్యాలయంలో మహిళా సర్పంచులకు శిక్షణ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఎంపీపీ దంతులూరి ప్రకాశం ఎంపీడీవో ప్రభాకర్ శర్మ గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి శిక్షణ తరగతులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు పాత్ర కీలకమని అన్నారు. మహిళా సర్పంచులు అన్నింటిలో రాణించాలని సూచించారు.