ఖమ్మం: అశ్వాపురం మండలం మొండికుంట వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియని ఆటో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అంబులెన్స్ సహాయంతో భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.