KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్కి బాలికల గిరిజన గురుకుల పాఠశాలను సోమవారం MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏఎన్ఎంను పిలిచి బాలికలకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే బాన్సువాడకు తరలించాలని తెలిపారు.