ఖమ్మం: కరెంట్ షాక్తో ఎద్దు మృతి చెందిన ఘటన ఏన్కూర్ మండలం టీఎల్ పేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. షేక్ సైదులుకు చెందిన ఎద్దు పొలంలో మేత మేసేందుకు వెళ్లి అక్కడే తెగి పడి ఉన్న 11కేవీ విద్యుత్ వైరును తగిలి షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు.