VZM: రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన సూచించారు. సోమవారం స్దానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన వాటర్ RO ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడుతూ.. వైద్య సేవలపై ఆరాతీసారు. ఈ మేరకు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరింటెండెంట్ జి.శశిభూషణరావు ఆదేశించారు. వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.