NZB: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని NZB అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ప్రజావాణి కావడంతో కలెక్టరేట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు.