SDPT: జిల్లాలో వివిధ రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రతి వాహనదారుని ప్రాణాలు ముఖ్యమని పగడ్బందీగా రోడ్ భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో రోడ్డు భద్రత కమిటీ, మత్తు పదార్థాల వినియోగ నివారణకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.