కృష్ణా: మచిలీపట్నంలోని జాతీయ రహదారి 216 లోని హర్ష కాలేజ్ సమీపంలో శనివారం ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి వారికి ISI మార్క్ కలిగిన హెల్మెట్లను కొనుగోలు చేయించి, తగిన అవగాహన కల్పించారు. అనంతరం వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు పంపించారు.