KMM: సత్తుపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూపరింటెండెంట్ కే. వెంకటేశ్వర్లును ఆదేశించారు. శనివారం ఆమె స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి పలు సూచనలు చేశారు. ఆసుపత్రి మందులు, వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.