వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా కొత్త పత్తికి రూ.7,191 ధర రాగా, పాతపత్తికి రూ.7300 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,200 పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.16 వేలు పలికింది. తేజ మిర్చి ధర నిన్న రూ.14,700 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.