MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామంలో పురాతన శివాలయం పునర్నిర్మాణంపై గ్రామ పెద్దలు బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గ్రామంలోని అన్ని కులాలకు సంబంధించిన వారి అభిప్రాయాలను స్వీకరించారు. ఆలయానికి కావలసిన స్థల సేకరణ, పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు, విరాళాలు తదితర విషయాల గురించి చర్చించారు.