BHNG: దేశ సమైక్యతకు మతాలు, కులాలకు అతీతంగా అందరూ ఐక్యంగా కృషి చేయాలని రామన్నపేట తాహసీల్దార్ లాల్ బహదూర్ అన్నారు. వందేమాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సామూహికంగా వందేమాతర గేయంను ఆలపించారు.