NZB: వరి ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరుతో రైస్ మిలర్ల దోపిడీని అరికట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ల కురిసిన వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపర్చాయన్నారు.