KNR: హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ బాబు చొరవతో కమలాపూర్లో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద స్థలాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, ఇంజనీర్ ఎల్లేష్ పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు ఆధునాతన మార్కెట్ యార్డు నిర్మించనున్నట్లు మార్కెట్ ఛైర్మన్ తౌటం జాన్సీ రాణి తెలిపారు.