KMM: తుపాన్ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో కోరారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా ఖమ్మం జిల్లాలో అక్టోబర్ 29,30 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.