JGL: మెట్పల్లి పట్టణంలో అభివృద్ధి పనుల కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్–2 ఏఈ రవి తెలిపారు. కళానగర్, దోబీ ఘాట్, రాంనగర్, ఆదర్శనగర్, ప్రభుత్వ ఆసుపత్రి, కొత్త బస్టాండ్, హెచ్పి పెట్రోల్ బంక్ ఏరియాలలో సరఫరా ఉండదు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.