WNP: పానగల్ మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని మండల విద్యాధికారి శ్రీనివాసులు గురువారం సందర్శించారు. ఈసందర్భంగా మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, ఒక ప్రణాళికతో చదువుతూ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను సూచించారు.