మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకులు ఇవాళ మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ను తన నివాసంలో కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరా పండుగను హిందూ సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు శివరాజ్ పాల్గొన్నారు.