SRPT: రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం మంజూరు చేసిన రంజాన్ తోఫా కానుకలను నడిగూడెం మండలం వల్లాపురంలో ఇవాళ పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ సరిత ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు తోఫా కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పేద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కానుకలను అందిస్తోందని తెలిపారు.