KMR: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన కామారెడ్డిలో జరిగింది. సీఐ చంద్రశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. శాబ్దిపూర్ గ్రామానికి చెందిన యశోద కామారెడ్డిలోని ఓ గోదాం పక్కన నిలబడి ఉంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ వెల్లడించారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్పై కేసు నమోదు చేశామన్నారు.