WNP: అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దమందడిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఫైనల్లో తాడిపర్తి జట్టు అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి రూ.40 వేల ప్రథమ బహుమతి గెలుచుకుంది. పెద్దమందడి జట్టు రూ.25 వేల ద్వితీయ బహుమతి అందుకుంది. వారం రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వాహకులు విజేతలకు ట్రోఫీలు, మెమొంటోలు అందజేశారు.