గద్వాల: సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం గద్వాలలో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్ష శిబిరం వద్దకు చేరుకొని మద్దతు ప్రకటించారు. విద్యారంగ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను విస్మరించడం ప్రభుత్వానికి తగదన్నారు.