HYD: ఘట్కేసర్ మండలం కాచవాణి సింగారంలో ఆక్రమణకు గురైన 6.12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా సోమవారం స్వాధీనం చేసుకుంది. సర్వే నంబర్ 66లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా లేఅవుట్ వేసి ప్లాట్లుగా విక్రయించిన విద్యాసంస్థల అధినేత నల్లమల్లారెడ్డి చర్యలపై హైడ్రా కఠినంగా వ్యవహరించింది. ఏడాది క్రితం కూడా ఇదే ప్రాంతంలో హైడ్రా అడ్డుగోడలను తొలగించడం గమనార్హం.