KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలోని దక్షిణ భారత దేశంలో అతి పెద్ద బౌద్ధ స్థూపాన్ని మంగళవారం బౌద్ధ సాధువులు సందర్శించారు. బౌద్ధులపై దేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న చర్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షు సద్ధారక్కిత, బిక్జు ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. బౌద్ధ ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.