KMR: బిక్కనూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ రేపు పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో వెంకటేశ్వర ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంతో పాటు కాచాపూర్ గ్రామంలోని వీరేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.