RR: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా షాద్ నగర్లోని గాంధీ నగర్లో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రజలకు తడిచెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. ఇళ్లల్లో, పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నియంత్రించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.