BDK: చర్ల మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల్లో సీపీఐ, బీఎస్పీ పార్టీ నాయకులు గురువారం పర్యటించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర నాయకులు కల్లూరి వెంకటేశ్వర్లు, బీఎస్పీ మండల అధ్యక్షుడు కొండా చరణ్ కోరారు. విజయ్ కాలనీలోనిలో ఉన్న సర్వే నెం.117లో 3 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించారని తెలిపారు.