KMM: ముదిగొండ మండలం వల్లాపురం గ్రామంలో వరి పొలాలను కెవికె వైరా శాస్త్రవేత్తలు మంగళవారం పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతు తాటికొండ రమేష్ వరి పొలంలో సుడిదోమ, బ్యాక్టీరియా తెగులు ఎండు తెగులు, ఆకు ముడతను శాస్త్రవేత్తలు గుర్తించారు. వరి పొలాలకు సోకుతున్న చీడపీడల నుంచి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలో రైతులకు శాస్త్రవేత్తలు పలు సలహాలు ఇచ్చారు.