KMM: వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ఈరోజు కారేపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కారేపల్లి క్రాస్ రోడ్ నందు నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లును భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.