MBNR: జడ్చర్ల మండలం కిష్టంపల్లి పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామి నారాయణ స్కూల్ సమీపంలో బైక్పై నుంచి పడి, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారేపల్లికి చెందిన బంగారయ్య (26) మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో మారేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.