KNR: చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ, 11వ తరగతుల ప్రవేశానికి దరఖాస్తుల గడువును అక్టోబర్ 21 వరకు పొడిగించారని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి కరీంనగర్ జిల్లాలో 8వ,10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని సూచించారు.