PDPL: ఈనెల 14న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్లో రామగుండం కమిషనరేట్ పరిధిలో రికార్డు స్థాయిలో 13,048 కేసులు పరిష్కారమైనట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. 80 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రూ.17,66,294 రికవరీ సొమ్ము అందినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృషి చేసిన పోలీస్, కోర్టు అధికారులు, సిబ్బందికి త్వరలో రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.