E.G: కోకో రైతుల నుంచి కోకో గింజలు కొనుగోలుకు కొవ్వూరులో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత సోమవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు ఈ సెల్ ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం కోకో గింజలు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.