KDP: అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు రఘువర్మ కుటుంబానికి ఎస్పీ అశోక్ కుమార్ రూ.5.15 లక్షల ఎక్స్గ్రేషియా సాయం అందచేశారు. సోమవారం కడపలోని పోలీస్ కార్యాలయంలో హోంగార్డు రఘువర్మ భార్య కె.విజయమేరికు చెక్కును అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డుల సంక్షేమమే లక్ష్యంగా ఈ ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.