అన్నమయ్య: రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా అదనపు ఎస్పీ యం.వెంకటాద్రి ప్రజలనుండి వినతులను స్వీకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను విచారించి వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.