SRD: తమ గ్రామంలో మంచినీటి ఎద్దడి నెలకొందని, మిషన్ భగీరథ నీరు రావడంలేదని సిర్గాపూర్ మండలం సుర్త్యాతాండ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి ఆరంభంలోనే నీటి కష్టాలు మొదలయ్యాయని శంకర్, భీమ్ రావు, తదితరులు ఆవేదనతో తెలిపారు. గత వారం రోజుల నుండి నిల్వ ఉన్న ఉంచిన నీటిని సేవిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్య తీర్చాలని కోరారు.