NZB: మోస్రా మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్మించిన యోగా కేంద్రాన్ని శుక్రవారం ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ విజయ్ కుమార్, మాజీ జడ్పీటీసీ గుత్ప భాస్కర్రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. మండల ప్రజలు యోగా కేంద్రాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు.