JGL: దసరా పండుగ వేళ జగిత్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రానికి కొత్తగా మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్న 35 విద్యాలయాలకు అదనంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లో ఈ కొత్త విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.