MNCL: మంచిర్యాల 27వ డివిజన్లోని గాంధీనగర్లో మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్యకు వివరించగా.. వారు మేయర్ ధర్ని మధుకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బుధవారం మరమ్మతు పనులు చేపట్టారు. పనులు పూర్తవగానే ప్రతి ఇంటికి సక్రమంగా మంచినీరు సరఫరా చేయనున్నట్లు కార్పొరేటర్ తెలిపారు.