JGL: కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ సమీపంలో ధాన్యం లోడుతో వెళ్తున్న ఒక డీసీఎం వ్యాన్ అదుపుతప్పి ఐలాపూర్ గ్రామాల మధ్య కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడగా, వ్యాన్లోని కొన్ని ధాన్యం బస్తాలు కాలువలో పడి తడిసిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.