WGL: దుగ్గొంది మండల కేంద్రంలోని మైసంపల్లె గ్రామంలో లంపీ స్కిన్ వ్యాధి వ్యాప్తి తో ఆవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు తెలిపారు. పశువుల శరీరంపై గడ్డలు ఏర్పడి పాలు ఉత్పత్తి తగ్గిపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి మరింత విస్తరించకముందే పశువైద్య శాఖ అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు.