SRCL: సిరిసిల్ల శ్రీ గురుకులాశ్రమ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాలధారుల కోసం 11 రోజుల పాటు నిత్య అన్నదాన (భిక్ష) కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు ప్రతిరోజూ 250 మంది స్వాములకు భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. గత పదేళ్లుగా దాతల సహకారంతో ఈ సేవను కొనసాగిస్తున్నట్లు ఏనుగుల ప్రభాకర్, శ్రీనివాస్ ఇతర నిర్వాహకులు తెలిపారు.