NZB : జిల్లా కేంద్రంలో తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన టేబుల్ క్యాలెండర్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో తపస్ భవనానికి స్థలం కోసం ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన తపస్ ఇందూరు జిల్లా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదనా చారిలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.