WGL: దుర్గ భవాని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా మాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారు మాట్లాడారు. పసిడి పంటలతో ఆయురారోగ్యాలతో ప్రజలందరూ బాగుండాలని వారు కోరారు.