NRML: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో మార్చి 8న ఆరు రోజుల పుణ్యక్షేత్ర యాత్ర నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ పండరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూరి జగన్నాథ దేవాలయం సహా పలు క్షేత్రాలు సందర్శనకు గాను పోను–రాను కలిపి ఒక్కొక్కరికి రూ. 6400గా నిర్ణయించారు. నమోదు కోసం నిర్మల్ బస్టాండ్లో సంప్రదించాలన్నారు.