MDK: మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయానికి రూ.16.87 లక్షల ఆదాయం సమకూరింది. దర్శనాలు, ప్రసాదాలు, అద్దె గదుల ద్వారా ఈ మొత్తం వచ్చినట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. గత ఏడాది (రూ. 13.13 లక్షలు) కంటే ఈసారి రూ. 3.74 లక్షల ఆదాయం అదనంగా పెరిగింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం గణనీయంగా వృద్ధి చెందిందని అధికారులు వెల్లడించారు.