WGL: గీసుగొండ మండలం ఊకల్ శ్రీనాగేంద్ర స్వామి ఆలయంలో మంగళవారం ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శన చార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయం నుంచి ఆలయానికి భక్తులు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకుడు శ్రీహర్ష, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.