JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన జైనపురం త్రిష జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైంది. నారాయణపేట జిల్లాలో జరిగిన అండర్-17 రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి, ఈనెల 19 నుంచి 23 వరకు గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననుంది. ఈ ఎంపికపై హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు, గ్రామ ప్రజలు త్రిషను అభినందించారు.